తిరుమలలో శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. 19న ఉగాది ఆస్థానం

4 months ago 22
Tirumala Koil Alwar Tirumanjanam Ugadi Asthanam: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఆగమోక్తంగా జ‌రిగింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. మార్చి 19వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పుర‌స్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో కప్పి ఆలయ శుద్ధి నిర్వహించారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర ”పరిమళ” జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు.
Read Entire Article