CJI Justice Sanjiv Khanna Tirumala Temple Visit: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఆయన దర్శనం అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించిన సీజేఐ.. శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రం కప్పగా, రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. తితిదే ఈఓ, అదనపు ఈఓ శ్రీవారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, క్యాలెండర్ అందజేశారు. అయితే ఆయన సామాన్య భక్తుడిలా వ్యవహరించారు.. ఆ వివరాలివే