Area Domination Security Forces In Tirumala: భారతదేశం, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భద్రత కట్టుదిట్టం చేశారు. తిరుమలలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు, పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద భద్రత పెంచారు. గన్నవరం విమానాశ్రయం, విశాఖ పోర్టులోనూ భద్రతను పటిష్టం చేశారు. తూర్పు తీరంలో కాపలాగా ఉండే నౌకను పశ్చిమ తీరానికి తరలించారు. పెట్రోల్, డీజిల్ నిల్వ ట్యాంకుల వద్ద నిఘా పెంచారు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది?