marriage fraud in hyderabad: వివాహం పేరుతో ఒంటరి వృద్ధులను మోసం చేస్తున్న ఇద్దరు మహిళలను మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరేళ్లుగా నకిలీ మ్యారేజ్ బ్యూరో ద్వారా సుమారు 100 మందిని మోసం చేసి లక్షలు కొల్లగొట్టారు. బాధితుల నుంచి నగదును మనీ ట్రాన్స్ఫర్ ద్వారా స్వీకరించేవారు. అలానే బాధితుల వద్ద నుంచి బంగారు నగలు కొనుగోలు చేయించి.. ఆ తర్వాత వాటిని విక్రయించి సొమ్ము చేసుకునేవారు. 100 మందిని మోసం చేశారు. చివరకు ఖమ్మం తాత ఇచ్చిన ఫిర్యాదుతో వీరి మోసం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..