ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ను గెలిపించి హీరోగా నిలిచిన తిలక్ వర్మకు హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు సోమవారం రాత్రి తిలక్ వర్మ చేరుకోగానే వందలాది మంది అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అభిమానులకు అభివాదం చేసేందుకు తిలక్ వర్మ కారు సన్ రూఫ్పైకి ఎక్కి సందడి చేశాడు.