తెలంగాణ కాంగ్రెస్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తీరు ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వర్గంపై తీన్మార్ మల్లన్న బహిరంగంగానే అనుచిత వ్యాఖ్యలు చేయటం, ప్రభుత్వం చేసి కులగణన సర్వే రిపోర్టును తగలబెట్టటం లాంటి చర్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే.. రేవంత్ రెడ్డి సర్కారుపై హైకోర్టు కూడా అసహనం వ్యక్తం చేయటం గమనార్హం.