డ్రగ్స్పై యుద్ధం ప్రకటించిన తెలంగాణ పోలీసులు.. ఎక్కడికక్కడ మెరుపు దాడులు, సోదాలు నిర్వహించి స్మగ్లర్ల ఆటకట్టిస్తున్నారు. తాజాగా, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఓ కంటెయినర్ లారీని ఆపి తనిఖీలు నిర్వహించగా.. అందులో ఉన్న గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. మొత్తం 300 కిలోలు ఉండే ఆ గంజాయి విలువ మార్కెట్లో కోటి రూపాయలు పైనే ఉంటుందని లెక్కగట్టారు. ఈ క్రమంలో ఒక్కో ట్రిప్కి ఆ కంటెయినర్ డ్రైవర్కు రూ.3 లక్షలు ముట్టజెప్పుతున్నారు.