రాజీవ్ యువ వికసం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. దరఖాస్తులు ప్రారంభం అయిన దగ్గర నుంచి కూడా అభ్యర్థులకు ఎన్నో రకాల సందేహాలు మొదలయ్యాయి. వాటికి సంబంధించి పరిష్కారాలు చూపుతూ ప్రభుత్వం స్వీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. ఎట్టకేలకు పరిశీలన ప్రక్రియ కూడా తుది దశకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో యూనిట్ కు ఊహించని విధంగా దరఖాస్తులు రావడంతో.. ఎంపిక చేయడంలో అధికారులకు కాస్త ఆలస్యం అయింది.