ఈ నెల 25లోగా రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పండ్ల తోటలు వేసిన రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం రైతుబంధు తప్ప ఇతర పథకాలు ఆపేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పాత రుణమాఫీని కూడా అమలు చేస్తోందని ఆయన అన్నారు.