గుంటూరు జిల్లా తురకపాలెంలో గత నాలుగు నెలలుగా అంతుబట్టని వ్యాధితో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర, జాతీయస్థాయి వైద్య బృందాలు అక్కడ శిబిరాలను ఏర్పాటుచేసి, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. అక్కడి మట్టి నమూనాలు సేకరించారు. ఎయిమ్స్ బృందం వైద్యులు పర్యటించి రక్త నమూనాలు తీసుకుని, పరీక్షలకు పంపారు. ఈ క్రమంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ గ్రామంలోని ఓ ఆర్ఎంపీ నడుపుతోన్న క్లినిక్ను అధికారులు సీజ్ చేశారు.