తెలంగాణ బీజేపీ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. 22 మందితో కూడిన ఈ కార్యవర్గంలో యువతకు, వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు. ఉపాధ్యక్షులుగా మాజీ ఎంపీ డా.బూర నర్సయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శిగా మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు తూళ్ల వీరేందర్ గౌడ్, అధికార ప్రతినిధిగా మాజీ ప్రధాని పీవీ మనవడు ఎన్.వి.సుభాష్లకు స్థానం లభించింది.