తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మహిళలు, రైతులు, యువతకు శుభవార్తలు తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు. వారికి ఉచిత వైద్య పరీక్షలు అందించేందుకు త్వరలోనే కొత్త పథకం తెస్తామని ప్రకటించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు రూ.500 బోనస్, 'భూభారతి' ద్వారా భూ సమస్యల పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.