రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ఇక నుంచి ఇంటర్ ఫస్టియర్లోనూ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ కొత్త మార్పులు అమల్లోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు. మ్యాథ్స్ సబ్జెక్టులోనూ థియరీ మార్కులు తగ్గించి.. వాటిని ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా చేర్చనున్నారు. విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.