ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అధికారం శాశ్వతం కాదని, ఉద్యోగులు, ప్రజలే తమ బలమన్నారు. గత ప్రభుత్వ ఆర్థిక తప్పిదాలు ఉన్నప్పటికీ.. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కుల గణన విషయంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, బీసీలకు న్యాయమైన రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగులు సహకరిస్తే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువవుతాయని అన్నారు.