ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ.8,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ప్రభుత్వం ఈ బిల్లులను ప్రతి నెల విడతల వారిగా చెల్లించడానికి చర్యలు తీసుకుంటుందని చెప్పారు.