ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలను ఈటల రాజేందర్ ఖండించారు. తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి నెలకు 20 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే దివాళా తీసిందని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. చేతకాకపోతే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.