మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏమైనా నీ అయ్య సొత్తా.. నీ అయ్య జాగీరా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఇటీవల తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటూ వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించిన కడియం శ్రీహరి.. ఫైర్ అయ్యారు. తెలంగాణకు కేసీఆర్ ఏం చేశారని.. ఎలా జాతిపిత అయ్యారంటూ మండిపడ్డారు.