తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో శాఖల కేటాయింపుపై ఉత్కంఠ నెలకొంది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, వివేక్లకు శాఖలు కేటాయించాల్సి ఉంది. ఈ విషయమై సీఎం రేవంత్రెడ్డి మరికాసేపట్లో ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఆర్థిక, పౌర సరఫరాల శాఖలతో సహా పాత మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది.