ఫిబ్రవరి 4న ఇక నుంచి సోషల్ జస్టిస్ డేగా జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కులగణనతో పాటుగా.. ఎస్సీ వర్గీకరణకు మంత్రి మండలి, శాసనసభ ఆమోదం తెలిపిన ఈ ప్రత్యేకమైన రోజును ప్రతి ఏడాది తెలంగాణ సామాజిక న్యాయ దినంగా జరుపుకోవాలని సూచించారు. ఈరోజుకు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.