తెలంగాణలోని నిరుద్యోగ యువత కోసం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు నేటితో ముగుస్తుంది. SC, ST, BC, మైనారిటీ వర్గాల వారికి రూ.4 లక్షల వరకు రాయితీ రుణాలను అందించే ఈ పథకానికి కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు అవసరం కాగా, మీసేవ కేంద్రాల్లో ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో గడువు పొడిగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.