మలుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఏఆర్ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో గొడవపడి ఆమెను ఇంటి నుంచి పంపేసిన ఎస్సై ఆ తర్వాత గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. ఈ ఘటనలో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.