తెలంగాణలో ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి అన్ని మండల కేంద్రాల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మీ-సేవ అధికారులు ఆధార్ నిర్వాహకులకు నూతన కిట్లను పంపిణీ చేశారు. కొత్త సెంటర్ల ఏర్పాటు వల్ల పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గుతాయి.