తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు తీపి కబురు చెప్పింది. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కూరగాయలు, పండ్లు, పూల క్రయవిక్రయాలు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ ఒకే చోట లభించేలా సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. తొలి విడతలో రాష్ట్రంలోని పెద్ద మార్కెట్ యార్డుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.