తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గుతాయన్నారు. నేడు ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.