తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు ఉంటాయని అన్నారు. భారీ ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.