తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో కమలం పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఈ విజయం పట్ల ప్రధాని మోదీ సైతం హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలను చూసి గర్వపడుతున్నానని చెప్పారు.