లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్లు రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ కూడా కల్పిస్తోంది. మార్చి 31వరకు ఈ రాయితీ అందుబాటులో ఉండనుండగా.. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.