మహాశివరాత్రి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలోని శైవ క్షేత్రాలను సందర్శించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం స్పెషల్ బస్సులను నడిపించాలని నిర్ణయించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో.. మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసుల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించగా.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగా.. రద్దీకి తగ్గట్టుగా అదనపు సర్వీసులు నడిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు.