తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. విజన్-2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని, దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.99 శాతం అని వెల్లడించారు. పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్, హైడ్రా ద్వారా ప్రభుత్వ భూముల రక్షణ, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు వంటి కీలక అంశాలను ప్రస్తావిస్తూ తెలంగాణ అభివృద్ధి రోడ్ మ్యాప్ను ఆయన వివరించారు.