తెలంగాణలో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం, సమయపాలనపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేయగా.. చాలా మంది అధికారులు ఆలస్యంగా వచ్చారు. దీంతో సమయానికి రాని ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని.., కార్యాలయంలో తక్షణమే ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.