ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ మరోసారి నిరాశ కల్పించింది. పీఆర్సీ గడువును మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వేతనాలు పెరుగుతాయని ఆశతో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఆశలు అడియాసలు అయ్యాయి. అయితే పీఆర్సీ కమిటీ ఇప్పటివరకు నివేదికను ప్రభుత్వానికి సమర్పించకపోవడంతో.. దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరోసారి పీఆర్సీ గడువు పెంచడంతో వేతనాల పెంపు మరింత ఆలస్యం కానుంది.