తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ కేసులో సాక్షిగా మారనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద ఆయన వాంగ్మూలం ఇవ్వనున్నారు. 2023 ఎన్నికల సమయంలో ఆయన ఫోన్ను బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన వాంగ్మూలం రికార్డు చేయనున్నారు.