Eggs Removed Mid Day Meal: తెలంగాణలో కోడిగుడ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్లు కష్టమైంది. వారానికి మూడుసార్లు ఇవ్వాల్సిన గుడ్లను రెండుసార్లు మాత్రమే పెడుతున్నారు. గుడ్ల ధర పెరగడంతో.. కొనుగోలు చేయాలంటే వంట కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తే బాగుంటుందని సూచనలు వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం అమలుతో పాటు, మధ్యాహ్న భోజనంలో మార్పులు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.