తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి సర్కార్.. వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే.. త్వరలో మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.