తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఇందిరా మహిళాశక్తి సంబరాలలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) నేటి నుంచి రూ.344 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ చేయనుంది. గ్రామీణ సంఘాలకు రూ. 300 కోట్లు, పట్టణ సంఘాలకు రూ. 44 కోట్లు అందజేయనున్నారు. ప్రమాద బీమా కింద మరణించిన సభ్యుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, రుణ బీమా కింద రుణాల మాఫీ అందిస్తారు.