తెలంగాణ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక బృందాల కోసం 'ఇందిరా మహిళా డెయిరీ' పథకాన్ని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎంపికైన మహిళా లబ్ధిదారులకు 80 శాతం సబ్సిడీతో రెండు గేదెలను పంపిణీ చేస్తారు. మొదటి విడతలో 125 మందికి గేదెలు అందజేశారు. పాల సేకరణ కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు.