సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో.. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. ఈరోజు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనుండగా.. బీఆర్ఎస్ నేతలు కీలక పిలుపునిచ్చింది. సీఎం సభను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నియోజకవకర్గంలోని కీలక బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్ట్ చేశారు.