తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో అమరవీరుడు కల్నల్ సంతోశ్ బాబు తల్లి బిక్కుమళ్ల మంజుల ఉపేందర్.. సూర్యాపేట 44వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్ పాలన, స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నాయకత్వంలో సూర్యాపేట అభివృద్ధిని ఆమె ప్రశంసించారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కాగా, 2020లో గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో సంతోశ్ బాబు వీరమరణం పొందారు.