తెలంగాణ యువతకు ఆర్మీ ఉద్యోగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతోంది. సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయిన సదరన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ సి. రాజేష్ పుష్కర్తో ఆర్మీ నియామకాలకు ముందస్తు ట్రైనింగ్లో చర్చించారు. జిల్లా కేంద్రాల్లో యువత కోసం ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం కోరగా.. అందుకు లెఫ్టినెంట్ జనరల్ సానుకూలంగా స్పందించారు. ఆర్మీ రిక్రూట్మెంట్లకు ముందే యువతకు శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.