జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. దీర్ఘకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందుతూ ప్రాణాలు కోల్పోయారు. గోపీనాథ్ మూడుసార్లు జూబ్లీహిల్స్ నుండి శాసనసభ్యునిగా ప్రజలకు సేవలందించారు.. అలాగే బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లాకు అధ్యక్షునిగానూ పని చేశారు. గోపినాథ్ మృతిపట్ల పలు పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.