తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలకు జపాన్లోని కితాక్యూషూ సిటీ మేయర్ బృందం ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా పథకాల వేగవంతానికి 'మిషన్ 26 డేస్' ప్రారంభమైంది. రైతు భరోసా నిధుల చెల్లింపు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనుంది.