తెలంగాణలో మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నేటి నుంచి (మార్చి 20) కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. మార్క్ఫెడ్ ద్వారా క్వింటాకు రూ.2400 మద్దతు ధరతో తొలి విడతగా 12 జిల్లాల్లో 20 కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 8 లక్షల టన్నుల కొనుగోలుకు కేంద్రం అనుమతించగా.. రికార్డు స్థాయి దిగుబడి నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.