తెలంగాణలో అర్హులైనా రైతు రుణమాఫీ కానటువంటి రైతులకు అలర్ట్. అటువంటి వారుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి సూచించారు. అర్హులను గుర్తించి వారందరికీ రైతు రుణమాఫీ అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వెంటనే వ్యవసాయశాఖ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.