విశాఖపట్నం ఐటీ సంస్థలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ఐటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, గూగుల్ వంటి సంస్థలు ముందుకు రాగా.. ఇదే బాటలో ఐబీఎం, క్యాప్జెమిని ఉన్నట్లు తెలిసింది. విశాఖకు ఆరేళ్ల తర్వాత ఐబీఎం సంస్థ తిరిగి వస్తున్నట్లు తెలిసింది. అలాగే క్యాప్జెమిని సంస్థ శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం అవసరమైన భూమి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.