తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులకు కళ్లలో ఆనందం నింపే వార్త చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. జనవరి 26వ తేదీన లాంఛనంగా ప్రారంభించిన రైతు భరోసా పథకంలో భాగంగా.. ఆరోజు ఎంపిక చేసిన గ్రామాల అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించగా.. తిరిగి ఈరోజు (ఫిబ్రవరి 05) మళ్లీ ఆ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు.