తెలంగాణ రైతులకు సర్కార్ శుభవార్త చెప్పింది. యాసంగిలో ధాన్యం విక్రయించిన వారికి ప్రభుత్వం వేగంగా చెల్లింపులు చేస్తోంది. కొత్త విధానంతో కొనుగోలు వివరాలు త్వరగా నమోదు కావడంతో మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే.. ఇప్పటికే రూ. 186 కోట్లు జమ చేశారు. ప్రైవేట్ వ్యాపారుల కంటే ప్రభుత్వమే ఎక్కువ ధర చెల్లిస్తోంది. సన్న వడ్లకు అదనంగా బోనస్ కూడా ఇస్తున్నారు.