తెలంగాణ రైతులకు శుభవార్త. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రాన్ని తాకనున్నాయి. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయన్నారు. ఇక రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు.