యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు బోనస్ చెల్లించడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధాన్యం సేకరించిన వెంటనే సన్న ధాన్యం పండించిన అన్నదాతలకు క్వింటాల్కు రూ.500 బోనస్ జమ చేసేలా చర్యలు మొదలుపెట్టింది. ఈ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తుండగా.. అందుకు రూ.1500 కోట్లు అవసరం కానున్నాయి.