తెలంగాణలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొంటామని హామీ ఇచ్చారు. ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో 50 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని, ఇది గత ఏడాది కంటే రెట్టింపు అని ఆయన తెలిపారు. రైతులకు అండగా నిలబడటమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.