రేవంత్ ప్రభుత్వం రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా పంట పెట్టుబడి నగదు జమ చేయనుంది. నేడు లేదా రేపు ఎకరాకు రూ.6 వేల చొప్పున ఖాతాల్లో వేయనుంది. ఇప్పటికే ఒక్క ఎకరం ఉన్న 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. జమ కాని వారు సంబంధిత ఏఈవో, ఏవోను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.